Fire Accident: పార్క్ చేసిన బస్సుల్లో మంటలు.. మూడు బస్సులు దగ్ధం
By - Subba Reddy |13 Feb 2023 5:45 AM GMT
ఐడీఎల్ చెరువు సమీపంలో పార్క్ చేసిన ప్రైవేటు బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐడీఎల్ చెరువు సమీపంలో పార్క్ చేసిన ప్రైవేటు బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థాలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే మూడు బస్సులు దగ్ధం అయ్యాయి. మరో నాలుగు బస్సులను అక్కడి నుంచి సేఫ్ గా తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వాహనాలు భారతి ట్రావెల్స్ కు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైన ఆకతాయిలు నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com