GHMC నిర్వాకం.. చిన్నారిని మింగేసిన మ్యాన్హోల్
సికింద్రాబాద్లో విషాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. కళాసిగూడలో 9 ఏళ్ల చిన్నారిని మ్యాన్హోల్ మింగేసింది. మ్యాన్హోల్ మూత తెరిచి ఉండటంతో చిన్నారి డ్రైనేజీలో పడిపోయింది. ఆ తర్వాత నాలాలో కొట్టుకుపోయింది.
తెల్లవారుజాము నుంచి నగరంలో వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి నగరంలోని నాలాలన్ని ఉప్పొంగి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి మౌనికను తల్లిదండ్రులు పాలప్యాకెట్ కోసం బయటకు పంపారు. స్థానికంగా డ్రైనేజ్ పనులు చేపడుతున్న జీహెచ్ఎంసీ.. మ్యాన్హోల్ మూత తెరిచే ఉంచారు. నాలాలు ఉప్పొంగి ప్రవహించడం, మ్యాన్హోల్ మూత తెరిచి ఉంచడంతో చిన్నారి ప్రమాదవశాత్తు డ్రైనేజ్లో పడిపోయింది. పార్క్లైన్ వద్ద పాప మృతదేహాన్ని DRF సిబ్బంది గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com