సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలి : సీఎం కేసీఆర్
By - kasi |25 Nov 2020 3:26 PM GMT
తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్లో.. తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మతవిద్వేశాలు రెచ్చగొట్టే కుట్ర పన్నుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
అరాచక శక్తుల కుట్రలపై ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారం ఉందన్న కేసీఆర్.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానం అని స్పష్టం చేశారు. సంఘ విద్రోహశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని.. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com