వివాదంలో చిక్కుకున్న GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి..!

వివాదంలో చిక్కుకున్న GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి..!
కరోనా కారణంగా సెలవు పెడితే తమ ఉద్యోగాలను వేరేవాళ్లకు ఇచ్చారంటూ పారిశుద్ద్య కార్మికులు ఆరోపించారు.

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి మరో వివాదంలో చిక్కుకున్నారు. కరోనా కారణంగా సెలవు పెడితే తమ ఉద్యోగాలను వేరేవాళ్లకు ఇచ్చారంటూ పారిశుద్ద్య కార్మికులు ఆరోపించారు. తమను తిరిగి ఉద్యోగాల్లో నియమించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్‌ను వేడుకున్నారు. మేయర్ ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నా.. కరుణించలేదన్నారు. తమ స్థానంలో కేశవరావు కారుడ్రైవర్ తల్లిని, మేయర్ డ్రైవర్ భార్యను నియమించారంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు. బాధితుల తరుపున సీపీఐ నాయకులు జీహెచ్ ఎంసి కమిషనర్ ను కలిసి మెమోరాండం సమర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story