ఆసిఫాబాద్‌ జిల్లాలో బాలికను బలితీసుకున్న పెద్దపులి

ఆసిఫాబాద్‌ జిల్లాలో బాలికను బలితీసుకున్న పెద్దపులి

ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. చేనులో పత్తి ఏరడానికి వెళ్లిన ఓ బాలికను బలితీసుకుంది. పెంచికల్‌ పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల పత్తి చేనుకు వెళ్తుండగా.. పొదల మాటున పొంచి ఉన్న పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని దిగడ గ్రామంలో పెద్దపులి ఓ యువకుడిని చంపేసింది. ఆ తర్వాత కూడా ఇదే ప్రాంతంలో పులి తిరగడం చాలా మంది చూశారు. రెండు రోజుల క్రితమే ఓ వాగులో పులి నీరు తాగుతున్న దృశ్యాలను.. స్థానికులు కెమెరాల్లో బంధించారు. రెండు దాడులు జరిగింది ఒకే ప్రాంతం కావడంతో.. నిర్మలను చంపింది కూడా మ్యాన్‌ ఈటర్‌గా మారిన పులే అని అటవీ అధికారులు భావిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story