అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం
By - Nagesh Swarna |26 Nov 2020 10:45 AM GMT
హైదరాబాద్లో ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ఘాట్ లను కూల్చివేయాలంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే.. ఆ చేతులు నరికేస్తామంటూ హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహానుభావుల విగ్రహాలు కూల్చుతామనడం సరికాదన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం ఇప్పటికే ఆలస్యమైందని.. ఎన్టీఆర్ పేరు చెప్పి తెలంగాణలో ఓట్లు అడిగే వారంతా ఆయనకు భారతరత్న ఇవ్వమని డిమాండ్ చేయాలని బుచ్చయ్య చౌదరి సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com