Governor Tamilisai : మళ్లీ డాక్టర్గా గవర్నర్ తమిళిసై.. ఫ్లైట్లోనే చికిత్స..
Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కొద్దిసేపు డాక్టర్గా మారారు. ఓ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి రక్షించారు.. వారణాసి నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు.. ఫ్లైట్ గాల్లో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు అస్వస్థకు గురయ్యాడు.. చెస్ట్ పెయిన్ ఇతర సమస్యలు రావడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు.. దీంతో అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది డాక్టర్ కోసం అనౌన్స్ చేశారు.. అదే ఫ్లైట్లో హైదరాబాద్ వస్తున్న గవర్నర్ తమిళిసై వెంటనే స్పందించారు. ఆమె డాక్టర్ కావడంతో స్వయంగా ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు.
గవర్నర్ ట్రీట్మెంట్తో కోలుకున్న ప్రయాణికుడు తమిళిసైకి కృతజ్ఞతలు తెలిపాడు.. ఇతర ప్రయాణికులు కూడా అభినందనలు తెలిపారు.. కొంతమంది ప్రయాణికులు ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com