నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
By - Nagesh Swarna |17 March 2021 11:12 AM GMT
గార్ల మండలం 175 పోలింగ్ కేంద్రంలో.. 603 ఓట్లు పోల్ కాగా.. లెక్కింపులో 31 ఓట్లు తగ్గాయని ఏజెంట్లు ఆందోళనకు దిగారు.
నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు ఏజెంట్లు ఆందోళనకు దిగారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం 175 పోలింగ్ కేంద్రంలో.. 603 ఓట్లు పోల్ కాగా.. లెక్కింపులో 31 ఓట్లు తగ్గాయని ఏజెంట్లు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై పలువురు ఏజెంట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com