గ్రేటర్ ఎన్నికలు : 19 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల

గ్రేటర్ ఎన్నికలు : 19 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల

హైదరాబాద్ గడ్డపై పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక తరహా విజయం సాధించాలని ఊవిళ్లూరుతోంది. ఇప్పటికే 21 మందితో తొలిజాబితా ప్రకటించిన బీజేపీ.... తాజాగా 19 మందితో రెండో జాబితా ... విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు అధిష్ఠానం అప్పగించింది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నాయకులను కాషాయం జెండా కప్పుతోంది. చేరికలు కమలం పార్టీలో జోష్ పెంచుతున్నాయి. దుబ్బాక విజయంతో ఊపు మీదున్న కమలం పార్టీ గోల్కొండ కోటపై కూడా కాషాయం జెండా ఎగరేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ అమిత్ షాగా మారాయి.

19 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల

*ఝాన్సీ బజార్‌ - రేణుసోని

*జియాగూడ - బోయిన దర్శన్‌

*మంగళ్‌ హాట్‌ - శశికళ

*దత్తాత్రేయ నగర్‌ - ధర్మేంద్ర సింగ్‌

*గోల్కండ - పాశం శకుంతల

*గుడి మల్కాపూర్‌ - దేవర కర్ణాటకర్‌

*జాంభాగ్‌ - రూప్‌ ధారక్‌

*నాగోల్‌ - చింతల అరుణా యాదవ్‌

*మన్సూరాబాద్‌ - కొప్పుల నర్సింహారెడ్డి

*హయత్‌నగర్‌ - కల్లెం నవజీవన్‌రెడ్డి

*లింగోజీ గూడ - ఆకుల రమేష్‌ గౌడ్

*కొత్తపేట - పవన్‌కుమార్‌ ముదిరాజ్‌

*చైతన్యపురి - రంగా నర్సింహా గుప్త

*సరూర్‌ నగర్‌ - ఆకుల శ్రీవాణి

*బీఎన్‌రెడ్డి - లచ్చిరెడ్డి

*చంపాపేట్‌ - వంగా మధుసుధన్‌రెడ్డి

Tags

Read MoreRead Less
Next Story