మావోయిస్టు అగ్రనేత భాస్కర్ టార్గెట్గా గ్రేహౌండ్స్ ఆపరేషన్

X
By - kasi |22 Sept 2020 11:33 AM IST
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రేహౌండ్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత భాస్కర్ టార్గెట్గా కూంబింగ్ చేస్తున్నారు. ఈనెల 19న కడంబా అడవుల్లో ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు తప్పించుకున్నట్టు సమాచారంతో అప్పటి నుంచి గాలింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా డ్రోన్లను సైతం మావోయిస్టుల జాడ కనిపెట్టేందుకు వాడుతున్నారు. ప్రాణహిత పరీవాహక ప్రాంతంలోనూ కొనసాగుతున్న గాలింపు కొనసాగుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com