దుబ్బాకలో చరిత్ర సృష్టిస్తాం : హరీశ్‌

దుబ్బాకలో చరిత్ర సృష్టిస్తాం : హరీశ్‌

Harish Rao (File Photo)

దుబ్బాక ఉపఎన్నికలో గతంలో కంటే భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టిస్తామని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ బలం పెరుగుతోందని అన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో వివిధ పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజలు సానుకూలంగా ఉండటం వల్లే ఇతర పార్టీల నేతలు చేరుతున్నారని అన్నారు. దుబ్బాక ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి నేతలు, యువకులు టీఆర్‌ఎస్‌ వైపు వస్తున్నారని చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story