అవంతికి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు ఫిర్యాదు చేస్తే రక్షణ కల్పించేవాళ్లం : సీపీ

X
By - Nagesh Swarna |29 Sept 2020 8:29 PM IST
అవంతి, హేమంత్లు పెళ్లిచేసుకున్నాక బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే.. వారికి రక్షణ కల్పించే వారిమన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈ కేసులో ఏ1 యుగంధర్ రెడ్డి, ఏ2 లక్ష్మారెడ్డిలను 6 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 14 మందిని అరెస్టుచేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఆరు గంటలుగా అవంతి కుటుంబ సభ్యులను విచారించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టమని స్పష్టం చేశారు. హేమంత్ పరువు హత్యకేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగుతుందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com