హైదరాబాద్‌లో దారుణం.. హిజ్రాపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన..

హైదరాబాద్‌లో దారుణం.. హిజ్రాపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన..

హైదరాబాద్‌లో హిజ్రాల మధ్య గ్యాంగ్‌ వార్‌.. ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎర్రగడ్డ, చందానగర్‌ హిజ్రా గ్రూపులు పరస్పరం దాడికి దిగాయి. గత రాత్రి హంసా అనే హిజ్రాను.. చందానగర్‌కు చెందిన గ్రూప్‌.. పెట్రోల్‌ పోసి సజీవదహన యత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన హంస... ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఇటీవల హంస అనే హిజ్రా... ఎర్రగడ్డ నుంచి చందానగర్‌కు మకాం మార్చింది. దీంతో తమ ఏరియాలోకి వచ్చిందనే కోపంతో చందానగర్‌కు చెందిన హిజ్రాలు.. పలుమార్లు వార్నింగ్‌ ఇచ్చారు. గతంలో కూడా రెండు వర్గాల మధ్య కత్తులతో పరస్పర దాడులు కూడా జరిగాయి. ఈ సారి ఏకంగా పెట్రోల్‌ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

హంసపై దాడి చేసింది సదా, ఆమె భర్త శంకరేనని తెలంగాణ ట్రాన్స్‌ జెండర్‌ సమితి నేతలు లైలా, చంద్రముఖి ఆరోపించారు. గత కొద్ది రోజులుగా హంసపై బెదిరింపులు, దాడులకు దిగారని చెప్పారు. 30 నుంచి 40 మంది వరకు హంసపై దాడికి పాల్పడ్డారని... ఇంత జరుగుతున్నా... హత్యాయత్నానికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని తెలిపారు. హంస... ఆత్మహత్య చేసుకుందనేది అబద్ధమని అన్నారు.

ఇదిలా ఉంటే... పెళ్లైనవారు కూడా హిజ్రాలుగా చలామణి అవుతున్నారని.. ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చినవారికి హిజ్రా వేషం వేయించి సెక్స్‌ వర్క్‌లోకి దింపుతున్నారని మండిపడ్డారు. అసలైన హిజ్రాలను కిడ్నాప్‌ చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. హంసపై హత్యాయత్నానికి పాల్పడిన సదా, శంకర్‌ గ్యాంగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ట్రాన్స్‌ జెండర్‌ సమితి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story