హైదరాబాద్‌లో ఈడీ సోదాలు, భారీగా నగదు, నగలు గుర్తింపు

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు, భారీగా నగదు, నగలు గుర్తింపు
హైదరాబాద్‌లో ఏడు ప్రాంతాల్లో ఈడీ చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో ఏడు ప్రాంతాల్లో ఈడీ చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. భారీగా నోట్ల కట్టలు, కోటి రూపాయలకు పైగా విలువైన నగలు గుర్తించినట్టు తెలుస్తోంది. మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ పీఎస్‌ ముకుందరెడ్డి బంధువు వినయ్‌, ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అటు.. డొల్ల కంపెనీల వెనుక కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story