టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే : బల్మూరి వెంకట్
By - /TV5 Digital Team |7 Oct 2021 3:23 PM GMT
టీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటేనన్నారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్.
టీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటేనన్నారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్. గత ఏడేళ్ల కాలంగా ఎలాంటి అభివృద్ధి చేయని పాలకులు... ఇవాళ ఓటు అడగడం బాధాకరమన్నారు. నిరుద్యోగి అయిన తనకు 35 వేల మంది నిరుద్యోగులు అండగా ఉన్నారన్నారు. రేపు తాను నామినేషన్ వేయడానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ రేంవత్ రెడ్డి హాజరవుతారని వెంకట్ తెలిపారు. కాగా టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com