Panjagutta PS: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం..

Panjagutta PS: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం..
పంజాగుట్ట పీఎస్‌ సిబ్బంది మొత్తం బదిలీ

హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిసంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ప్రక్షాళన చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేస్తూ సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ సీపీ బదిలీ చేశారు. భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తంపై బదిలీ వేటు పడింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కొత్త సిబ్బందిని సీపీ కేటాయించారు. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల నుంచి పంజాగుట్ట పీఎస్‌కు కొత్త సిబ్బంది నియమించారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ లు మొదలు హోంగార్డ్ వరకు మొత్తం 84 మంది షిప్టుల వారిగా విధులు నిర్వహిస్తుంటారు. సీఐలు, ఎస్ఐలు మినహా మిగతా సిబ్బంది కొన్నేళ్ల నుంచి ఒకేచోట పాతుకుపోయి ఉండటంతో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం తో ఉన్నారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై స్టేషన్ లో సిబ్బందిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story