Hyderabad Metro : ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త..!

Hyderabad Metro : ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త..!
Hyderabad Metro : ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్తను తెలిపింది. ఆ నెల(అక్టోబర్) 18 నుంచి మెట్రో సువర్ణ ఆఫర్‌ ను అమల్లోకి తెస్తున్నట్లుగా మెట్రో ఎండీ NVS రెడ్డి తెలిపారు.

Hyderabad Metro : ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్తను తెలిపింది. ఆ నెల(అక్టోబర్) 18 నుంచి మెట్రో సువర్ణ ఆఫర్‌ ను అమల్లోకి తెస్తున్నట్లుగా మెట్రో ఎండీ NVS రెడ్డి తెలిపారు. గత ఏడాది దసరా పండుగ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ రాయితీలు ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్‌ కింద ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ కల్పించింది. ఈ ఆఫర్ కింద స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు, 20 ట్రిప్పుల ఛార్జీలతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు, 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరగొచ్చు. అలాగే JBS-MGBS స్టేషన్ల మధ్య గరిష్ఠ టికెట్ చార్జీ రూ. 15 మాత్రమే.

Tags

Read MoreRead Less
Next Story