హైదరాబాద్‌ SBI ఏటీఎంలో చోరీ

హైదరాబాద్‌ SBI ఏటీఎంలో చోరీ
హైదారాబాద్‌ వనస్థలిపురంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు..

హైదారాబాద్‌ వనస్థలిపురంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. మొత్తం 5 మంది ముఠా సభ్యులు... కారులో వచ్చి చోరీ చేశారు. దుండగుల్లో ఒకరు ఏటీఎంలోకి గ్యాస్ కటర్‌తో వెళ్లినట్లు సీసీ దృశ్యాల్లో రికార్డు అయ్యాయి.

6 పోలీసు టీంలు దొంగల కోసం గాలిస్తున్నాయి. దుండగులు ఏటీఎం నుంచి ఎంత మొత్తం దోచుకెళ్లారనేది తెలియాల్సి ఉంది. 4 ఏళ్ల క్రిందట ఇదే ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎంలో అలారం లేకపోవడంతో రెండో సారి కూడా చోరి జరిగినట్లు భావిస్తున్నారు. పాత నేరస్థులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story