ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇంత అరాచకం జరిగేది కాదు: బండి సంజయ్
By - prasanna |6 April 2021 11:15 AM GMT
ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉగ్రవాదాన్ని అరికట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మళ్లీ రెచ్చిపోతున్నారని ఆరోపించింది తెలంగాణ బీజేపీ.
ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉగ్రవాదాన్ని అరికట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మళ్లీ రెచ్చిపోతున్నారని ఆరోపించింది తెలంగాణ బీజేపీ. నక్సలైట్లు హతమారుస్తున్నా బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. బీజేపీ ఉంటేనే ఉగ్రవాదాన్ని అణచివేయగలమని చెప్పుకొచ్చారు. బీజేపీ ఆవిర్భావం సందర్భంగా నాంపల్లి పార్టీ ఆఫీసులో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలు పడిన బాధలు, కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మన్, డీకే అరుణ పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com