మంత్రి KTR అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం

మంత్రి KTR అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం
తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణానికి ఫిదా అవుతున్న దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి

మంత్రి KTR అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణానికి ఫిదా అవుతున్న దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ఐటీ అనుబంధ సేవా రంగంలో హైదరాబాద్‌లో సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బెయిన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌నకు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం సంస్థ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ ఎరికా బోగర్‌కింగ్‌ ఈ మేరకు వెల్లడించారు. దీనిద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో సేవలు అందిస్తుంది. ఇక నగరానికి మరో ఐటీ సంస్థ రావడంతో మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.

అదేవిధంగా రాష్ట్రంలో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు మండీ హోల్డింగ్స్‌ సంస్థ ప్రకటించింది. హూస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో మండి హోల్డింగ్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌, సీఈవో ప్రసాద్‌ గుండుమోగుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చారు. దీనిద్వారా 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story