తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ
By - TV5 Digital Team |7 Jan 2021 10:05 AM GMT
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిఎం కేసీఆర్,కేంద్రమంత్రి కిషన్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com