హైదరాబాద్ నగరంలో సీసీకెమెరాల ఏర్పాటు పరిశీలించిన కిషన్రెడ్డి
By - Nagesh Swarna |4 Oct 2020 11:55 AM GMT
స్మార్ట్ పోలీస్ విధానం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటును పరిశీలించారాయన. సీసీ కెమెరాల నిఘాలో హైదరాబాద్ ముందుందన్నారు. ప్రపంచంలోనే తొలి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు కిషన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్సీపీ అంజనీకుమార్. ముఖ్యమైన కేసుల దర్యాప్తునకకు సీసీకెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. సిటీలో ఐదు లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com