మానసిక రోగిని నడిరోడ్డుపై తాళ్లతో కట్టి చితకబాదిన సర్పంచ్‌ కొడుకు

మానసిక రోగిని నడిరోడ్డుపై తాళ్లతో కట్టి చితకబాదిన సర్పంచ్‌ కొడుకు

నిర్మల్‌ జిల్లాలోని దారుణం జరిగింది. ఓ మానసిక రోగిని నడిరోడ్డుపై తాళ్లతో కట్టి చితకబాదాడు సర్పంచ్‌ తనయుడు శ్రీను. ఈ ఘటన కడెం మండలం లింగాపూర్‌ గ్రామంలో జరిగింది. మతిస్థిమితం లేని రాజు ఇంటి పక్కనే లింగాపూర్‌ గ్రామ సర్పంచ్‌ ఇల్లు ఉంది. అయితే.. తనతో దురుసుగా ప్రవర్తించాడన్న కోపంతో.. రాజును కర్రతో చితకబాదాడు శ్రీను. కొడుకుకు మతి స్థిమితం లేదని, అతన్ని విడిచిపెట్టాలని రాజు తల్లి కాళ్లావేళ్లా పడినా లాభం లేకపోయింది.

అయితే.. శ్రీనుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఆమెను రాజు తిట్టడం వల్లే... ఇలా దాడి చేశారంటున్నారు గ్రామస్థులు. ఓ మానసిక వికలాంగుడిపై దాడి చేయడం దారుణమంటున్నారు గ్రామస్థులు. రాజును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. మహిళలతో అసభ్యంగా ప్రవరిస్తున్నాడంటూ... రాజుపై కేసుపెట్టాడు శ్రీను. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story