చాంద్రాయణ్‌గుట్ట డివిజన్‌లో పలువురి ఓట్ల గల్లంతు

చాంద్రాయణ్‌గుట్ట డివిజన్‌లో పలువురి ఓట్ల గల్లంతు

పాతబస్తీలోని చాంద్రాయణ్‌గుట్ట డివిజన్‌లో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. చాలామంది పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు లేదని తెలుసుకుని అధికారుల్ని ప్రశ్నించారు. బతికున్న మా ఓట్లు ఎక్కడికి పోయాయంటూ ఆందోళన చేశారు. లిస్టులో చనిపోయిన వాళ్ల పేర్లు ఉన్నాయని, బతికున్న వాళ్ల పేర్లు ఎందుకు తొలగించారని నిలదీశారు. ఓటరు లిస్టులో పేర్ల గల్లంతుతో ఆందోళన చేశారు. ఎంఐఎం దొంగ ఓట్లు వేసుకుంటోందంటూ నిరసన తెలిపారు. మరోవైపు... ఆరు ఆటోల్లో 30 మందికి పైగా బోగస్‌ ఓటర్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కోఠి నుంచి చాంద్రాయణ్‌గుట్టకు వీరిని తరలించినట్టు గుర్తించారు. జియాగూడలోనూ పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. ఓటర్‌ స్లిప్‌లు ఒక్క బూత్‌లోనే పెద్దసంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఆన్‌లైన్‌లో పేర్లు చూపిస్తున్నా... లిస్టులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story