Harish Rao : కేసీఆర్‌ కేంద్రానికి శత్రువయ్యారు : హరీష్‌ రావు

Harish Rao : కేసీఆర్‌ కేంద్రానికి శత్రువయ్యారు : హరీష్‌ రావు
Harish Rao : ఏపీ సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Harish Rao : ఏపీ సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ జిల్లాలోని నర్సంపేటలో జరిగిన బహరంగ సభలో బీజేపీపై విరుచుకుపడ్డారు. విద్యుత్‌ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్‌ కేంద్రానికి శత్రువయ్యారన్నారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో రైతులను కేంద్రం దోచుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మూడు టీఎంసీల పనులు ఆపాలని కేంద్రానికి లేఖ రాసింది బీజేపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే గ్యాస్‌ సబ్సిడీ ఎగ్గొట్టిన మోదీ ప్రభుత్వం.. యూపీ ఎన్నికలు అయిపోగానే పెట్రోలు ధరలు పెంచేందుకు సిద్ధమౌతోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story