Harish Rao : రాహుల్ గాంధీ ఒక ఐరెన్ లెగ్ : మంత్రి హరీష్ రావు
By - TV5 Digital Team |29 April 2022 11:15 AM GMT
Harish Rao : జాతీయ పార్టీలను నమ్మిమోసపోవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు.
Harish Rao : జాతీయ పార్టీలను నమ్మిమోసపోవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే వాళ్లు ఢిల్లీకి గులాంగిరి చేస్తరు అని, కేంద్రానికి కీలు బొమ్మగా మారిపోతారన్నారు.
నిజామాబాద్లో పర్యటించిన హరీష్ రావు.. బీజేపీ, కాంగ్రెస్లపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఐరెన్ లెగ్ అని.. ఆయన అడుగుపెట్టినచోట కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు అన్నివిధాలుగా ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు ఉత్తత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల్లో భారీ అవినీతి జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణాలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com