దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన మంత్రి హరీష్ రావు
By - kasi |10 Nov 2020 12:52 PM GMT
దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై మంత్రి హరీష్రావు స్పందించారు. ఎంతగానో కష్టపడ్డా.. తాము ఆశించిన ఫలితం దక్కలేదన్నారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తామన్న..
దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై మంత్రి హరీష్రావు స్పందించారు. ఎంతగానో కష్టపడ్డా.. తాము ఆశించిన ఫలితం దక్కలేదన్నారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తామన్న హరీష్... ఉప ఎన్నిక ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్కు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపిన హరీష్... ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని.. లోపాలను సవరించుకుంటామని చెప్పారు. దుబ్బాకలో ఓటమి ఎదురైనా ప్రజా సేవకు మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. టీఆర్ఎస్ ఎప్పుడూ దుబ్బాక ప్రజల పక్షాన ఉంటుందని... సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తామని హరీష్రావు స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com