బీజేపీ తీరుపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు
బీజేపీ తీరుపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.. సిద్ధిపేటలో నిన్న జరిగిన ఇష్యూలో బీజేపీ తనకు తానుగా సెల్ఫ్ గోల్ చేసుకుంది అంన్నారు.. దుబ్బాక నియోజకవర్గంలోని టిఆర్ఎస్ అభ్యర్థి తరుపున హరీష్ రావు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా తోగుటలో టీఆర్ఎస్ యువ గర్జన నిర్వహించారు.. భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు..
సిద్ధిపేటలో దొరికిన డబ్బులు బీజేపీవి కాకపోతే ఆ పార్టీ నేతలు అక్కడికి ఎందుకు వెళ్లారని నిలదీశారు.? దుబ్బాకలో టిఆర్ఎస్ గెలిచే పార్టీ.. బీజేపీ ఓడిపోయే పార్టీ అందుకే వారు ఫ్రస్టేషన్ లో ఉన్నారని హరీష్ రావు అభిప్రయపడ్డారు. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ వెనక్కు పోతే అందరూ రాజీనామా చేసినా.. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి ఎకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com