దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ ఇళ్ల నిర్మాణం : మంత్రి హరీష్రావు
By - TV5 Digital Team |24 Dec 2020 1:16 PM GMT
సిద్ధిపేట కేసీఆర్ నగర్లో పండుగ వాతావరణం నెలకొంది. 216 మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్రావు హాజరయ్యారు
సిద్ధిపేట కేసీఆర్ నగర్లో పండుగ వాతావరణం నెలకొంది. 216 మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్రావు హాజరయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సకల సౌకర్యాలతో నిర్మించామన్నారు. నయాపైసా ఖర్చు లేకుండా పేదలకు నూతన వస్త్రాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులు ఎవరికైనా అద్దెకు ఇచ్చినా విక్రయించినా చర్యలు తీసుకోవడంతో పాటు ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com