మంత్రి కొప్పుల ఈశ్వర్ కి కరోనా..!
By - TV5 Digital Team |9 May 2021 10:30 AM GMT
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్టుగా తేలింది. దీనితో ఆయన హైదరాబాదు లోని యశోద ఆసుపత్రిలో చేరారు.
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్టుగా తేలింది. దీనితో ఆయన హైదరాబాదు లోని యశోద ఆసుపత్రిలో చేరి అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇటీవల మంత్రిని కలిసినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ వరుస ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com