ఇంకో 25-30 సీట్లలో గెలుస్తామని భావించాం : మంత్రి కేటీఆర్

ఇంకో 25-30 సీట్లలో గెలుస్తామని భావించాం : మంత్రి కేటీఆర్

గ్రేటర్ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇంకో 25-30 సీట్లలో గెలుస్తామని భావించామని.. 12-15 చోట్ల చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో 18 ఓట్ల తేడాతో ఓడిపోయాని చెప్పారు. ఈ ఫలితాలతో నిరాశ చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ వెల్లడించారు. ఈ ఫలితాలపై పార్టీలో విశ్లేషించుకుని ముందుకు పోతామన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యావాదాలు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story