త్వరలోనే లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి చేస్తాం : కేటీఆర్

త్వరలోనే లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి చేస్తాం : కేటీఆర్
బడ్జెట్‌పై సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి 9 వేల కోట్లు ఖర్చు చేసామని తెలిపారు.

త్వరలోనే లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బడ్జెట్‌పై సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి 9 వేల కోట్లు ఖర్చు చేసామని తెలిపారు. టీఎస్ బీపాస్ ద్వారా అవినీతి రహితంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని స్పష్టంచేశారు. ఐదు రూపాయలకు నాణ్యమైన భోజనం అందిస్తూ పట్టణ పేదలకు అండగా ఉన్నామని చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ నగర విస్తరణపై దృష్టి సారించామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story