థియేటర్లు మూసివేస్తారన్న ప్రచారంపై మంత్రి తలసాని సృష్టత
By - Nagesh Swarna |24 March 2021 8:09 AM GMT
మళ్లీ థియేటర్లు మూసివేస్తే సినిమా పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళ్తుందని తలసాని పేర్కొన్నారు.
తెలంగాణలో థియేటర్లు మూసివేస్తారన్న ప్రచారం నమ్మవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలతోనే థియేటర్లు నడుస్తాయని తెలిపారు. సీట్ల కుదింపుపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. మళ్లీ థియేటర్లు మూసివేస్తే సినిమా పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళ్తుందని.. వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారని తలసాని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com