K Kavitha: రాహుల్‌ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

K Kavitha: రాహుల్‌ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్..
K Kavitha: తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్‌గాంధీపై ట్విటర్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్సీ కవిత.

K Kavitha: తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్‌గాంధీపై ట్విటర్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ అంశాలపైనా, తెలంగాణ హక్కులపైనా రాహుల్‌గాంధీ గాని, కాంగ్రెస్‌ పార్టీ గాని పార్లమెంట్‌లో ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పండని ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్‌లో టీఆర్ఎస్ పోరాడుతుంటే రాహుల్‌గాంధీ ఎక్కడ ఉన్నారన్నారు.

దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై పోరాటం చేస్తున్నప్పుడు రాహుల్ కనిపించలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణకు హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధులపై టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నప్పుడు రాహుల్‌గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారు?

రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పథకాలు తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండని సలహా ఇచ్చారు కవిత. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఇప్పుడు తెలంగాణ పథకాల గురించి తెలుసుకుని, అర్థం చేసుకోవడానికి వస్తున్నందుకు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story