మహాప్రస్థానంలో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

మహాప్రస్థానంలో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. హైదరాబాద్ మినిస్టర్స్ క్వాటర్స్ నుంచి ఇప్పటికే అంతిమ యాత్ర ప్రారంభమైంది..

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. హైదరాబాద్ మినిస్టర్స్ క్వాటర్స్ నుంచి ఇప్పటికే అంతిమ యాత్ర ప్రారంభమైంది. జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు జరగనున్నాయి.. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు భారీగా మహా ప్రస్థానానికి చేరుకుంటున్నారు..

కార్మినేతగా ముద్ర వేసుకున్న 80 ఏళ్ల నాయిని నర్సింహారెడ్డి బుధవారం అర్థరాత్రి కన్నుమూసారు. సెప్టెంబర్‌ 28న కరోనా బారిన పడిన ఆయన బంజారాహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ.. అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. తెలంగాణ గవర్నర్‌, టిఆర్‌ఎస్‌ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు నాయినికి నివాళులర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story