Narendra Modi: హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి దేవాలయానికి మోదీ! కార్పొరేటర్ల కోరిక మేరకు..

Narendra Modi: హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి దేవాలయానికి మోదీ! కార్పొరేటర్ల కోరిక మేరకు..
Narendra Modi: హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకునే అవకాశం ఉంది.

Narendra Modi: హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకునే అవకాశం ఉంది. భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించాలని బీజేపీ కార్పొరేటర్లు ప్రధానిని కోరగా.. తప్పక చూద్దామని ప్రధాని నవ్వుతూ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానిని కలిసిన తర్వాత బీజేపీ కార్పొరేటర్లలో కొత్త జోష్‌ కనిపిస్తోంది. పనిచేసే కార్పొరేటర్లకు ప్రమోషన్‌ ఇస్తామని కార్పొరేటర్లతో మోదీ చెప్పినట్లు సమాచారం. కష్టపడండి.. ఎమ్మెల్యే కల సాకారం చేసుకోవాలన్నారు.

ఇక జులై 2న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. ఆ సమయంలో అమ్మవారిని ప్రధాని దర్శించుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. బీజేపీకి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం సెంటిమెంట్‌ బాగా కలిసొచ్చింది. గతంలో హోం మంత్రి అమిత్‌ షా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బండి సంజయ్‌ పాదయాత్రను కూడా అమ్మవారి ఆలయం నుంచే ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story