ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్ రావు

ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్ రావు

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లకు గడువు ముగిసే సమయానికి మరో నామినేషన్ రాకపోవటంతో నవీన్ రావు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఆయన ధృవీకరణ పత్రాలను అందుకున్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు నవీన్ రావుతో పాటు మరో నామినేషన్ దాఖలైప్పటికీ..సంతకాలు లేకపోవటంతో రెండో నామినేషన్ ను తిరస్కరించారు. మే 31తో నామినేషన్లకు చివరి రోజు అయినా..ఇంకెవరు నామినేషన్ వేయలేదు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్ రావును మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story