Nirmal : "డబుల్‌ బెడ్రూం పంపిణిలో అర్హులకు అన్యాయం"

Nirmal : డబుల్‌ బెడ్రూం పంపిణిలో అర్హులకు అన్యాయం
డబుల్‌ బెడ్రూం పంపిణిలో అర్హులకు అన్యాయం జరిగిందంటూ... ఖానాపూర్‌ బంద్‌కు అఖిలఫక్షం పిలుపునిచ్చింది

డబుల్‌ బెడ్రూం పంపిణిలో అర్హులకు అన్యాయం జరిగిందంటూ... ఖానాపూర్‌ బంద్‌కు అఖిలఫక్షం పిలుపునిచ్చింది. ప్రస్తుతం బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. నిరుపేదలందరికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిన్న ఖానాపూర్‌లో400 డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి లక్కీడ్రా జరిగింది. అయితే... ఈ డ్రాలో 706 మంది అర్హులు ఎంపిక కావడంతో వివాదం రేగింది.

అర్హుల ఎంపికలో అధికారులు తప్పులు చేశారన్నారు ఎమ్మెల్యే రేఖానాయక్‌. దీంతో ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్‌ నేతలు. తప్పులుంటే లాటరీ ఎలా నిర్వహించారంటూ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ నేతల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఓ వైపు ఆందోళనలు, అరెస్ట్‌ల మధ్య డబుల్‌ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక జరిగింది. దీన్ని దీన్ని నిరసిస్తూ.. ఇవాళ ఖానాపూర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story