Nizamabad: జిల్లా ఆస్పత్రిలో దారుణం

Nizamabad: జిల్లా ఆస్పత్రిలో దారుణం

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో అత్యవరస పరిస్థితిలో రోగి కాళ్లు పట్టుకుని లిఫ్ట్ వరకు లాక్కెళ్లాల్సి వచ్చింది. రోగి వెంట వచ్చిన సహాయకులు అతడికి తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నా... ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో ప్రస్తుతం ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో రోగులు ఎన్ని ఇంబ్బందులకు గురవుతున్నార్నది ఈ ఘటనే స్పష్టంచేస్తోంది. రోగులకు సౌకర్యాలు, వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది.. కనీసం మానవతా విలువలు పాటించడం లేదా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story