Nizamabad: బీఆర్‌ఎస్‌ vs బీజేపీ.. పీక్‌ స్టేజ్‌లో ఫ్లెక్సీ వార్

Nizamabad: బీఆర్‌ఎస్‌ vs బీజేపీ.. పీక్‌ స్టేజ్‌లో ఫ్లెక్సీ వార్
బీజేపీ, బీఆర్ఎస్ నేతల పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాటు

నిజామాబాద్ జిల్లాలో ఫ్లెక్సీ వార్ పీక్ స్టేజ్‌కి చేరుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ నేతల పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎంపీ అర్వింద్ తెచ్చిన పసుపు బోర్డు ఇదేనంటూ నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు వాటిని చించేశాయి. అనంతరం బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. నిరుద్యోగ భృతి, నిజాం షూగర్ ఫ్యాక్టరీ, డబుల్ బెడ్ రూమ్ హామీలు ఏమయ్యాయని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక వాటిని గుర్తించిన బీఆర్ఎస్ శ్రేణులు తొలిగించారు.

Tags

Read MoreRead Less
Next Story