నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధికి నోముల ఎంతో కృషి చేశారు : కేటీఆర్
By - TV5 Digital Team |16 March 2021 8:15 AM GMT
దివంగత టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో పాటు పడ్డారని మంత్రి కేటీఆర్ అన్నారు.
దివంగత టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో పాటు పడ్డారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి కేటీఆర్ మద్దతు పలికారు. కమ్యూనిస్టు నుంచి బలమైన నాయకుడిగా ఎదిగిన నోముల నర్సింహయ్య.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. నోముల మరణం నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని లోటు అని కేటీఆర్ తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com