NZB: మండుతున్న ఎండలు.. మృత్యువాత పడుతున్న కోళ్లు

NZB: మండుతున్న ఎండలు.. మృత్యువాత పడుతున్న కోళ్లు

నిజామాబాద్‌ జిల్లాలో మండుతున్న ఎండలు పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగడంతో కోళ్లు మృత్యవాత పడుతున్నాయి. దాంతో కోళ్లను కాపాడుకునేందుకు పౌల్ట్రీ వ్యాపారులు పలు రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉదయం నుంచే స్ప్రింకర్లతో కోళ్లను చల్లబరుస్తున్నారు. దీనికి తోడు వేసవి తాపానికి గుడ్ల వినియోగం తగ్గిందని, కోళ్ల ధరలు పడిపోయాయని పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story