ప్రశాంతంగా కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్..!
By - TV5 Digital Team |14 March 2021 6:32 AM GMT
గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులు పోలింగ్ బూతులవద్ద బారులు తీరారు.
గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులు పోలింగ్ బూతులవద్ద బారులు తీరారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉంది. దీంతో ఓటువేయడంలో కాస్త ఆలస్యం అవుతోంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గాలకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కరోనా కట్టడి నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది శానిటైజ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com