Puttta Madhu : మళ్ళీ విచారణకు పుట్ట మధు.. !

Puttta Madhu : మళ్ళీ విచారణకు పుట్ట మధు.. !
న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసుతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ నేత పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసుతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ నేత పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. పుట్ట మధు మరోసారి ఇవాళ మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని రామగుండం పోలీసులు 41(a) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. ఆయన అనుచరుడు కుంట శ్రీను ఇంటి నిర్మాణం లావాదేవీలపై విచారణ జరపనున్నారు.

అటు పుట్ట మధుకు చెందిన 39 బ్యాంక్ అకౌంట్లో పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మూడు రోజుల విచారణ అనంతరం.. నిన్న రాత్రి పదకొండున్నర గంటల సమయంలో పోలీసులు పుట్ట మధును వదిలిపెట్టారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలనే ముందే స్పష్టం చేసిన పోలీసులు.. మళ్లీ ఇవ్వాళ హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.



Tags

Read MoreRead Less
Next Story