గ్రామస్తుల కళ్లముందే ఐదు కుందేళ్లను మింగేసిన కొండచిలువ

X
By - Nagesh Swarna |16 Oct 2020 3:30 PM IST
భారీ వర్షాలతో అడవుల్లోని జంతువులు, పాములు ఇళ్లలోకివస్తూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనిలో భాగంగా నల్గొండజిల్లా పెద్దాపురం మండలం చలకుర్తి గ్రామంలో ఓ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామంలోని కుందేళ్ల ఫామ్లోకి వెళ్లిన కొండచిలువ.. అందులోని ఐదు కుందేళ్లను వారి కళ్లముందే మింగేసింది. మరింత ఆందోళనకుగురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు అధికారులు అక్కడికి చేరుకొని కొండచిలువను నిర్బంధించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com