కోర్టు 'స్టే' తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాలి : సీఎం కేసీఆర్

కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాలి : సీఎం కేసీఆర్

ధరణి ఫోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందన్నారు సీఎం కేసీఆర్‌. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చిందని తెలిపారు. ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story