లాక్ డౌన్ లో పేదలకు ఉచిత భోజనం..!

లాక్ డౌన్ లో పేదలకు ఉచిత భోజనం..!
కరోనా సమస్యలతో చికిత్స పొందుతున్న బాధితులు వారి కుటుంబసభ్యులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు రేఖ చారిటబుల్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ బోయిలపల్లి రేఖ తెలిపారు.

కరోనా సమస్యలతో చికిత్స పొందుతున్న బాధితులు వారి కుటుంబసభ్యులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు రేఖ చారిటబుల్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ బోయిలపల్లి రేఖ తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో.. బాధితులకు ఉచిత భోజన వసతితో పాటు పండ్లను కూడా అందించారు. పేదలకు సాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన బోయిలపల్లి రేఖ.. లాక్ డౌన్ వేళ సహాయంపై బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తమ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు సూర్యాపేటలో సేవలను కొనసాగిస్తున్నట్లు వివరించారు. పరిశుభ్రమైన కిచెన్ లో ఆహార పదార్థాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story