భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి లేఖ

భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి లేఖ

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తగిన భద్రత ఇవ్వాలని పేర్కొంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీకుమార్ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ నెల ఒకటిన రాసిన ఈ లేఖ ప్రతి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇద్దరు సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, ఆరుగురు సబ్ ఇన్ స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ మొత్తం 69 మంది భద్రతను హైకోర్టు ఆదేశాల మేరకు తనకు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలో పాదయాత్ర సమయంలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున..జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని వివరించారు. అధికార పార్టీ సానుభూతిపరులు హాని తలపెట్టి, తన ప్రచారానికి ఆటంకం కలిగించే అవకాశం ఉందనిలేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి కనీసం ఆరుగురు+ఆరుగురు లెక్కన అయినా..భద్రత కల్పించాలని కోరారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పాటు అందించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తగిన భద్రత కల్పించకపోతే..కోర్టు ధిక్కరణ కింద తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

Next Story