ఆత్మహత్యకు ముందురోజు గొడవపడ్డ సాయి, శ్రావణి
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ప్రేమ పేరిట దేవరాజ్ సాగించిన వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని సాయి ఆరోపిస్తుండగా, సాయి వేధింపుల వల్లే మృతిచెందిందని దేవరాజ్ ఆరోపిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఫోన్ రికార్డులను ఇద్దరూ బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే సాయికృష్ణారెడ్డి, దేవరాజ్లను ఎదురెదురుగా కూర్చొబెట్టి పోలీసులు విచారించారు. శ్రావణిని దేవరాజ్ బెదిరించిన ఆడియోలు.. శ్రావణిని సాయి కొట్టినట్లు బయటికి వచ్చిన ఆడియోలపై పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
ఆ తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకొని...స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. సోమవారం ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది..దేవరాజ్, సాయిలతో పాటు వీరిద్దరి కుటుంబసభ్యులను కూడా పోలీసులు విచారించారు. అయితే శ్రావణి కేసులో A1, A2 ఎవరనేది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సాంకేతిక పరమైన ఆధారాలతో పాటు.. సాయి, దేవరాజ్, శ్రావణిలు మాట్లాడిన ఆడియో టేపులను పోలీసులు పరిశీలించారు. దేవరాజ్ తల్లితో శ్రావణి పోన్ కాల్ డేటాను కూడా సేకరించారు..
అయితే సాయికి శ్రావణి చనిపోవడానికి సంబంధం లేదని ఆమె తల్లి పాపా రత్నం చెప్పారు. దేవరాజు వల్లే ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణి సూసైడ్కు దేవరాజే కారణం అంటున్నాడు సాయిరెడ్డి. అతడు సాగించిన వేధింపులు తట్టుకోలేక చనిపోయిందని ఆరోపించారు..
ఆత్మహత్యకు ముందు రోజు సాయి, శ్రావణి రోడ్డుపై గొడవపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీటీవీల్లో రికార్డయింది. ఆ వీడియో కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అసలు ఈ గొడవకు ముందు హోటల్లో ఏం జరిగింది..? వీరిద్దరూ ఎందుకు గొడవ పడ్డారు..? అనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరించారు. అటు ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సినీ నిర్మాత అశోక్రెడ్డికి నోటీసులు జారీ చేశారు. శ్రావణి తల్లిదండ్రుల నుంచి కూడా ఇప్పటికే వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇప్పటి వరకు బయటకొచ్చిన ఆడియోలో వాస్తవాలను విశ్లేషించారు. సాయికృష్ణ, దేవరాజ్లను ఒకేచోట ఉంచి విచారించిన క్రమంలో కీలకమైన విషయాలను రాబట్టినట్లు సమాచారం. మరోవైపు ఓ హోటల్ వద్ద శ్రావణిని సాయికృష్ణ బెదిరించడంపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com