Telangana : క్షుద్రపూజలు అందుకే

Telangana : క్షుద్రపూజలు అందుకే
కేసీఆర్ తన ఆదాయాన్ని పెంచుకోవడం తప్ప చేసిందేమి లేదన్నారు

ఒకరిని నాశనం చేయడానికి సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మరొకరి నాశనం కోరితే తనే సర్వనాశనం అయిపోతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన ఆదాయాన్ని పెంచుకోవడం తప్ప చేసిందేమి లేదన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కేసీఆర్ పాలన రజాకార్లను గుర్తుకు తెస్తుందని చెప్పారు. కొండగట్టుకు 100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి రెండు నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story